Sunday, August 28, 2011

ఒక స్వతంత్ర, విశ్వసనీయ వ్యవస్థగా లోక్‌పాల్‌ ఉండాలంటే, మరింత మెరుగైన బిల్లు అవసరమని చెప్పారు. లోక్‌పాల్‌ బిల్లుతో పాటు అవినీతి వ్యతిరేక పోరాటంలో అనేక ముఖ్యమైన చర్యలు అవసరమన్నారు. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నివారించడం మరో కీలకమైన విషయమన్నారు. ' ప్రస్తుతం ఒక్కో శాసనసభ నియోజకవర్గంలో 10 నుండి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇటీవలి బెంగాల్‌ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఇంత ధనం ఎక్కడి నుండి వస్తుంది. ఈ స్థాయిలో ఖర్చు ఉంటే, పేదలు ఎలా పోటీ చేయగలరు ? ' అని వ్యాఖ్యానించారు. పన్ను ఎగవేత రూపంలో దేశానికి ఏటా వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు. 

No comments:

Post a Comment