రూపాయి (Indian Rupee) భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. Rs, రూ లను రూపాయికి గుర్తుగా వాడుతారు. ISO 4217 పద్ధతి ప్రకారం రూపాయి గుర్తు INR. సంస్కృత పదమైన రూప్యకం (అనగా "వెండి నాణెం") నుండి రూపాయి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూపాయిని రూపాయి, రూపీ, రుపయ్యా అని పలుకుతారు. అస్సామీ, బెంగాలీ భాషల్లో మాత్రం రూపాయిని టాకా అని పిలుస్తారు. రూపాయికి వంద పైసలు.
ఆధునిక కాలంలో, మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19 వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికా లోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. దాంతో, బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలుశక్తిని కోల్పోయింది. ఈ ఘటనను "రూపాయి పతనం" గా పిలుస్తారు.
బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు. 1815 వరకు, మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది. 12 ఫానంలు ఒక రూపాయికి సమానం.
స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.
1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో "కొత్త") పైసలు గా పిలిచారు. తరువాతి కాలంలో నయా అనేది మరుగున పడిపోయింది. "డేనిష్ ఇండియన్ రూపాయి"ని 1845 లోను, 1954 లో "ఫ్రెంచి ఇండియన్ రూపాయి"ని, 1961లో "పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో"ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.
నేపాల్ లో భారత్ సరిహద్దుకు దగ్గరి పట్టణాల్లో భారత రూపాయిని తీసుకుంటారు. ఇంగ్లండు లోని కొన్ని భారతీయ దుకాణాల్లో కూడా రూపాయిని తీసుకుంటారు.
చెలామణీలో ఉన్న నాణేలు 25 పైసలు (పావలా), 50 పైసలు (అర్థ రూపాయి), రూ. 1, రూ. 2 and రూ. 5.
ప్రస్తుతం చెలామణీలో ఉన్న నోట్లు రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 500, రూ. 1000. 1996 లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నోట్ల శ్రేణిని మహాత్మా గాంధీ శ్రేణి అంటారు.
అన్ని నోట్లూ, నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. ప్రస్తుతం చెలామణీలో లేని రూ. 1 నోట్లను మాత్రం భారత ప్రభుత్వం జారీ చేసేది. ప్రతీ నోటు మీదా దాని విలువ 17 భారతీయ భాషల్లో ముద్రించి ఉంటుంది.
నాణేలన్నిటినీ భారత ప్రభుత్వ మింటు యొక్క నాలుగు మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్, దేవాస్, సల్బోని, మైసూరు, హోషంగాబాదు లలో ముద్రిస్తారు.
విషయ సూచిక |
చరిత్ర
నాణేలు చెలామణీ చెయ్యడంలో భారత్ కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. (క్రీ.పూ. 6 వ శతాబ్దం). రూపాయిని మొదటి సారిగా షేర్షా సూరి ప్రవేశపెట్టాడని భావిస్తున్నారు. ఆ రూపాయికి 40 రాగి నాణేల విలువ ఉండేది. ఇక రూపాయి కాగితాలను మొదటగా ముద్రించినవారు "బ్యాంక్ ఆఫ్ హిందూస్థాన్" (1770-1832), "జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్" (1773-75), (వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు), బెంగాల్ బ్యాంక్ (1784-91).ఆధునిక కాలంలో, మొదట్లో రూపాయి అంటే ఓ వెండి నాణెం. 19 వ శతాబ్దంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు బంగారంపై ఆధారపడి ఉండేవి. ఆ సమయంలో అమెరికా లోను, ఇతర ఐరోపా ఆక్రమిత దేశాల్లోను అపారమైన వెండి నిల్వలను కనుక్కున్నారు. దాంతో, బంగారంతో పోలిస్తే వెండి విలువ పడిపోయింది. హఠాత్తుగా రూపాయి కొనుగోలుశక్తిని కోల్పోయింది. ఈ ఘటనను "రూపాయి పతనం" గా పిలుస్తారు.
బ్రిటిషు వారి కాలంలో రూపాయికి 16 అణాలు. ఒక్కో అణాకు 6 పైసలు లేదా 12 పై లు. 1815 వరకు, మద్రాసు ప్రెసిడెన్సీ ఫానం అనే ద్రవ్యాన్ని చెలామణీ చేసేది. 12 ఫానంలు ఒక రూపాయికి సమానం.
స్వాతంత్ర్యానికి ముందు తిరువాన్కూరు రూపాయి, హైదరాబాదు రూపాయి, కచ్ కోరీ.. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ ద్రవ్యం ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చాక, వీటన్నిటినీ తీసివేసి భారత రూపాయిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు.
1957లో రూపాయికి 100 పైసలుగా నిర్ధారించి, ఈ పైసలను నయా (హిందీలో "కొత్త") పైసలు గా పిలిచారు. తరువాతి కాలంలో నయా అనేది మరుగున పడిపోయింది. "డేనిష్ ఇండియన్ రూపాయి"ని 1845 లోను, 1954 లో "ఫ్రెంచి ఇండియన్ రూపాయి"ని, 1961లో "పోర్చుగీసు ఇండియన్ ఎస్కుడో"ను తొలగించి ఆ స్థానంలో భారత రూపాయిని ప్రవేశపెట్టారు.
అంతర్జాతీయంగా రూపాయి
దేశవిభజన తరువాత మొదట్లో పాకిస్తాను భారత రూపాయినే వాడేది; దానిపై పాకిస్తాను ముద్ర వేసుకునేవారు. గతంలో కువైట్, బహ్రెయిన్, కతర్, యు.ఎ.ఇ, మలేసియా లలో కూడా భారత రూపాయినే అధికారిక ద్రవ్యంగా వాడేవారు. దేశం బయట చెలామణీ కోసమై, ప్రత్యేకంగా గల్ఫ్ రూపీని 1959 మే 1 నాటి చట్టసవరణ ద్వారా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగారం దొంగరవాణా ద్వారా దేశ విదేశీ మారక ద్రవ్యంపై వస్తున్న వత్తిడిని తగ్గించందుకు గాను ఈ చర్య తీసుకున్నారు. 1966 జూన్ 6 న భారత్ తన ద్రవ్య విలువను తగ్గించినపుడు అప్పుడు గల్ఫ్ రూపీని వాడుతున్న ఒమన్, కతర్, ఇప్పటి యు.ఎ.ఇ లోని దేశాలు గల్ఫ్ రూపీ స్థానంలో తమ తమ ద్రవ్యాలను ప్రవేశపెట్టాయి. కువైట్ 1961 లోను, బహ్రెయిన్ 1965 లోను ఆ పని చేసేసాయి.నేపాల్ లో భారత్ సరిహద్దుకు దగ్గరి పట్టణాల్లో భారత రూపాయిని తీసుకుంటారు. ఇంగ్లండు లోని కొన్ని భారతీయ దుకాణాల్లో కూడా రూపాయిని తీసుకుంటారు.
నాణేలు, నోట్లు
| చెలామణీలో ఉన్న నాణేలు [1] | ||||||||
|---|---|---|---|---|---|---|---|---|
| Value | సాంకేతిక అంశం | వివరం | తేదీ | |||||
| వ్యాసం | బరువు | తయారీ | ఆకారం | బొమ్మ | బొరుసు | మొదటి ముద్రణ | చివరి ముద్రణ | |
| 5 పైసలు | 22 మి.మీ. (diagonal) | 1.5 గ్రా | అల్యూమినియం | చతురస్రం | భారత ఎంబ్లెమ్ | విలువ | 1957 | 1994 |
| 10 పైసలు | 16 మి.మీ. | 2 గ్రా | ఇనుపధాతువుతో కూడినది స్టెయిన్ లెస్ స్టీల్ | గుండ్రం | 1961 | 1998 | ||
| 20 పైసలు | 27 మి.మీ.(longest) | 2.2 గ్రా | అల్యూమినియం | షడ్భుజి | 1982 | 1994 | ||
| 25 పైసలు | 19 మి.మీ. | 2.83 గ్రా | ఇనుపధాతువుతో కూడినది స్టెయిన్ లెస్ స్టీల్ | గుండ్రం | భారత ఎంబ్లెమ్, విలువ | ఖడ్గమృగం | 1973 | – |
| 50 పైసలు | 22 మి.మీ. | 3.79 గ్రా | భారత పార్లమెంటు, భారత మ్యాపు | – | ||||
| రూ. 1 | 25 మి.మీ. | 4.85 గ్రా | భారత ఎంబ్లెమ్ | విలువ, గోధుమ | 1976 | – | ||
| రూ. 2 | 26 మి.మీ. | 6 గ్రా | క్యుప్రోనికెల్ | ఏకాదశభుజి | భారత ఎంబ్లెమ్, విలువ | భారత జండా, భారత మ్యాపు | 1990 | – |
| రూ. 5 | 23 మి.మీ. | 9 గ్రా | గుండ్రం | భారత ఎంబ్లెమ్ | విలువ, పువ్వు | 1992 | – | |
- 5, 10, 20 పైసల నాణేలు చెలామణీలో ఉన్నప్పటికీ, వాటి వాడకం తగ్గి, క్రమేణా కనుమరుగవుతున్నాయి.
| మహాత్మా గాంధీ శ్రేణి [2] | ||||||
|---|---|---|---|---|---|---|
| బొమ్మ వైపు | Value | కొలతలు | ముఖ్యమైన రంగు | వివరణ | జారీ తేదీ | |
| బొమ్మ | అచ్చు | |||||
| Rs. 5 | 117 × 63 మి.మీ. | ఆకుపచ్చ | మహాత్మా గాంధీ | ట్రాక్టరు | 2002 | |
| Rs. 10 | 137 × 63 మి.మీ. | కాషాయం - వంగ | ఖడ్గమృగం, ఏనుగు, పులి | 1996 | ||
| Rs. 20 | 147 × 63 మి.మీ. | ఎరుపు - కాషాయం | తాటిచెట్లు | 2002 | ||
| Rs. 50 | 147 × 73 మి.మీ. | వంగ | పార్లమెంటు | 1997 | ||
| Rs. 100 | 157 × 73 మి.మీ. | మధ్యలో నీలం - ఆకుపచ్చ, రెండువైపుల బ్రౌను - ఊదా | హిమాలయాలు | 1996 | ||
| N/A | Rs. 500 | 167 × 73 మి.మీ. | ఆలివ్, పసుపు | ఉప్పు సత్యాగ్రహం | 1997 | |
| పసుపు | 2000 | |||||
| Rs. 1000 | 177 × 73 మి.మీ. | గులాబీ | భారత ఆర్థిక వ్యవస్థ | 2000 | ||
ప్రస్తుతం చెలామణీలో ఉన్న నోట్లు రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 500, రూ. 1000. 1996 లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నోట్ల శ్రేణిని మహాత్మా గాంధీ శ్రేణి అంటారు.
అన్ని నోట్లూ, నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. ప్రస్తుతం చెలామణీలో లేని రూ. 1 నోట్లను మాత్రం భారత ప్రభుత్వం జారీ చేసేది. ప్రతీ నోటు మీదా దాని విలువ 17 భారతీయ భాషల్లో ముద్రించి ఉంటుంది.
నాణేలన్నిటినీ భారత ప్రభుత్వ మింటు యొక్క నాలుగు మింట్లలో ముద్రిస్తారు. నోట్లను నాసిక్, దేవాస్, సల్బోని, మైసూరు, హోషంగాబాదు లలో ముద్రిస్తారు.
No comments:
Post a Comment